ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఎంపీపీ ఆవుల భాగ్య లక్ష్మి గోపాల్ రెడ్డి

“జనం సాక్షి” చిన్న శంకరంపేట్” జులై 23, చిన్న శంకరంపేట్ మండల కేంద్రంలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా వాగులు  చెరువులు నిండి ప్రవహిస్తునందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఆని ఎంపీపీ ఆవుల భాగ్య లక్ష్మి కోరడం జరిగింది.
జంగ రాయి గ్రామ  ప్రజలకు తెలియజేయునది ఏమనగా  జంగారాయి చందాపూర్ గ్రామం మధ్యలో ఉన్నటువంటి జంగారాయి వాగు ఉధృతంగా ప్రవహిస్తూ రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్నందున  జంగారాయి గ్రామ ప్రజలు ఎవరూ కూడ వాహనాలపై  కానీ  కాలినడకన గానీ వాగు బ్రిడ్జి మీదుగా వెళ్లవద్దని పాత ఇండ్లు శిథిలావస్థకు చేరిన ఇండ్లలో నివాసం ఉంటున్న వారూ జాగ్రత్తగా ఉండాలని ఇతర గ్రామాల ప్రజలు కూడా జంగారాయి మీదుగా వెల్దుర్తి వెళ్ళే వారు వాగు పై నుండి వెళ్లవద్దని వేరే మార్గంలో వెళ్ళాలని  ఆధికారులు ఎప్పటికప్పుడు  అప్రమత్తంగా ఉండి మండల ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సేవలు అందించాలని ఈ అత్యవసర పరిస్థితుల్లో ఆధికారులు ఎవరూ కూడా సెలవుల్లో వెళ్లవద్దని ప్రజల ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ  ఉండాలని తెలపడం జరిగింది.
Attachments area