ప్రజల మనిషి ప్రద్యుమ్నరెడ్డి
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి
శివ్వంపేట ఆగస్ట్ 26 జనంసాక్షి : ప్రజల మనిషి ప్రద్యుమ్నరెడ్డి అని ఆయన ఆశయాలను తప్పకుండా కొనసాగిస్తామని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం శివ్వంపేట మండలంలోని రత్నాపూర్ గ్రామంలో జరిగిన దివంగత ప్రద్యుమ్నరెడ్డి ప్రథమ వర్ధంతి వేడుకలలో పాల్గొని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో జన్మించినపట్టికి కూడా కమ్యునిస్టు భావాలు కలిగిన ప్రద్యుమ్న రెడ్డి పేద ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడని ఆయన గుర్తు చేశారు. నక్సలిజం కాలంలో కూడా రత్నాపూర్ గ్రామంలోనే ఉండి గ్రామాభివృద్ధి కోసం, తనను నమ్ముకున్న పేద ప్రజల కోసం నిరంతరం పోరాడిన నాయకుడు ప్రద్యుమ్నరెడ్డి అని ఆయన కొనియాడారు. ఈకార్యక్రమంలో శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ,వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి, కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చింతల వెంకట్రామిరెడ్డి,వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్, అల్లీపూర్ ఎంపీటీసీ వాణీ రామ్మోహన్ రెడ్డి,మండల కో ఆప్షన్ మెంబర్ లాయక్, మండల పార్టీ కోశాధికారి బండారి గంగాధర్,మాజీ సర్పంచ్ నాయిని రామ్మోహన్ రెడ్డి, మన్నే నర్సింలు,నాయిని వేమారెడ్డి, ఆత్మ డైరెక్టర్ సూర్యం చౌహాన్,తదితరులు పాల్గొన్నారు.