ప్రజల వైపు అడుగులు వేస్తూ.. ప్రజల గుండెల్లో పాగా వేస్తూ…

 తగ్గేదెలే అంటున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ.
అచ్చంపేట ఆర్సీ,అక్టోబర్09, జనంసాక్షి న్యూస్ : కార్లు, కాన్వాయ్ లు, భజన బృందం హంగు ఆర్భాటాలు ఇవేమీ లేకుండా  ఒక సామాన్య పౌరుడిగా ఇక్కడే పుట్టి ఇక్కడి ప్రజలతో మమేకం అవుతూ వారి యోగ క్షేమాలు,వివిధ అంశాల పట్ల సమస్యలను తెలుసుకొంటు ఆప్యాయంగా పలకరిస్తూ  ప్రజల గుండెలో  సుస్థిర స్థానం కోసం ప్రజల వైపు అడుగులు వేస్తూ దూసుకుపోతున్న మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ , స్థానిక పట్టణంలో ఆదివారం సాయంత్రం  ప్రధాన రహదారిపై ఉన్న వ్యాపారస్థులను చిరు దుకాణ దారులను,ప్రజలను అందరిని కలుపుకొని పోయారు.దీంతో పట్టణంలోని ప్రజల మధ్య ఉన్న అభిప్రాయాలను ,ప్రజల నాఢీని తానే స్వయంగా తెలుసుకుంటూ తన పని తాను ఒక పద్దతిగా చేసుకుంటూ వడి వడిగా  ముందుకు  సాగుతున్నారు.
Attachments area