ప్రజాభారతి ఆధ్వర్యంలో నేడు దాశరధి జయంతి వేడుకలు

మోత్కూరు జూలై 21 జనంసాక్షి : మహాకవి దాశరధి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ప్రజాభారతి, శాఖా గ్రంథాలయం ఆధ్వర్యంలో నేడు దాశరధి జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ప్రజాభారతి అధ్యక్షులు టి. ఉప్పలయ్య తెలిపారు. నేడు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు మున్సిపల్ కేంద్రంలోని శాఖ గ్రంధాలయం ఆవరణలో కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కవి సమ్మేళనం ఉంటుందని కవులు రచయితలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.