*ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి

 కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్*
నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో అక్టోబర్ 17 జనం సాక్షి:
 ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 42 ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు.
 ఫిర్యాదును స్వీకరించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ మోతిలాల్, డిఆర్డిఏ పిడి నర్సింగరావు, సిపిఓ భూపాల్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.