ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి – అదనపు కలెక్టర్ యస్. మోతిలాల్

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని నాగర్ కర్నూల్ జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్ మోతిలాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో 43 ఫిర్యాదులను అదనపు కలెక్టర్ స్వీకరించారు.
 ఫిర్యాదును స్వీకరించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో సిపిఓ భూపాల్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.