ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి.

జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 18 (జనంసాక్షి):
ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించా లని జిల్లా కలెక్టర్‌ ఉదయ్ కుమార్ ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఆయన మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.మొత్తం 61 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటివరకు 829 ఫిర్యాదులు అందగా 419 ఫిర్యాదులు పరిష్కారం అవగా,32 ఫిర్యాదులు ఇతర శాఖలకు బదిలీ చెయ్యగా మిగిలిన 378 ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కారం చూపాలని అన్నారు.అదనపు కలెక్టర్ మోతిలాల్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.
Attachments area