ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించండి

జిల్లా అధికారులతో కలెక్టర్ శ్రీహర్ష

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 11 : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన ప్రజా వాణి సమావేశంలో మాట్లాడుతూ జిల్లా లో ప్రజావాణి ద్వారా వచ్చిన పిర్యాదులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను ఆయా శాఖల అధికారులు తక్షణం పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
తదనంతరం ప్రజా పిర్యాదులను స్వీకరించారు. మొత్తం 17 ప్రజా దరకాస్తులు, వాటిలో 12 భూ సమస్యలు, 5 ఇతర సమస్యలు పింఛన్లు, విద్య తదితర సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.