ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ ను జయప్రదం చేయండి.
తొర్రూర్ 26 ఆగస్టు( జనంసాక్షి )
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత పాదయాత్ర-ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ రేపు వరంగల్ లో నిర్వహించడం జరుగుతుంది అని బీజేపీ శ్రేణులు శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మానుకోట జిల్లా ఇంఛార్జి కట్టా సుధాకర్ పిలుపు ఇచ్చారు. ఈ రోజు తొర్రూర్ లో ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత పాదయాత్ర-ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.ప్రజల సమస్యలు వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు అని,ఈ పాదయాత్ర కు వేస్తున్న విశేష స్పందన ను ఓర్వలేక టీఆర్ఎస్ నేతలు అధికార దురంహంకారంతో అనేక అడ్డంకులను స్రృష్టిస్తున్నారని,తప్పుడు ప్రచారం చేస్తూ పోలీసులను అడ్డం పెట్టుకొని అడుగడుగునా యాత్రను అడ్డుకోవాలని చూస్తే న్యాయస్థానం ప్రభుత్వానికి మొట్టికాయలు వేసి యాత్ర కు అనుమతి ఇచ్చింది అని తెలిపారు.ప్రజాస్వామ్య బద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా అన్ని అనుమతులు తీసుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక అడ్డంకులను స్రృష్టించడం వారి నియంత్రృత్వ నిరంకుశ అహంకార పాలనకు నిదర్శనం అని తెలిపారు.ఎన్ని అడ్డంకులు సృష్టించినా వరంగల్ లో సభ జరిగి తీరుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మానుకోట జిల్లా అధ్యక్షుడు ఒద్దిరాజు రాంచందర్ రావు, బీజేపీ రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్, తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్,15వ వార్డు కౌన్సిలర్ కొలుపుల శంకర్,ఎంపిటీసి మదన్ లాల్, రాష్ట్ర, జిల్లా నాయకులు రంగు రాములు,పరుపాటి రాం మోహన్ రెడ్డి, రచ్చ కుమార్,కస్తూరి పులేందర్,అలిసేరి రవిబాబు, పూసాల శ్రీమాన్, మంగళపళ్ళి యాకయ్య, రాయపురం రాజకుమార్,జలగం రవి, మధుసూదన్ రెడ్డి, ఉపేందర్,కాగు నవీన్,కొండ యాకన్న, నూకల నవీన్ తదితరులు పాల్గొన్నారు.
