ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది
నర్సాపూర్, ( జనం సాక్షి )
ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. గురువారం నర్సాపూర్ పట్టణంలోని సాయి కృష్ణ ఫంక్షన్ హాల్ లో 57 సంవత్సరాలు నిండిన వృద్ధులకు మంజూరైన ఆసరా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. అంతకుముందు నర్సాపూర్ మున్సిపల్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్ర గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, వైస్ చైర్మన్ నయీమ్ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
