ప్రజా సమస్యలను విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.

CPI కొంకనివాని పల్లి గ్రామ మహాసభలో సిపిఐ మండల కార్యదర్శి….
వనపర్తి జులై 14 (జనం సాక్షి) బుధవారం అమరచింత మండల పరిధిలోని కొంకనివానిపల్లి సిపిఐ గ్రామ మహాసభ జరిగింది. ముందుగా అరుణపతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా సిపిఐ మండల కార్యదర్శి అబ్రహం హాజరై మాట్లాడారు. ప్రజా సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తూ రాజకీయ ఎజెండాలతో ఒకరినొకరు విమర్శించుకుంటూ పబ్బం గడుపుతున్నారని సిపిఐ మండల కార్యదర్శి అబ్రహం విమర్శించారు. అనంతరం గ్రామ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ సిపిఐ కార్యదర్శిగా మరోసారి జి.మల్లేష్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కృష్ణయ్య, వెంకటేష్,అంజి,శ్రీను,బాలరాజు,అంజీ,యం.డి కుతూబ్,వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Attachments area