ప్రతిపక్ష హోదా కోసం భాజపా, జేడీఎస్‌ పోటాపోటీ

బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల్లో తీవ్రంగా భంగపడ్డ భాజపా ప్రతిపక్ష హోదా కోసం జేడీఎస్‌తో పోటీ పడుతోంది. భాజపా, జేడీఎస్‌లు చెరో 38 స్థానాల్లో విజయం సాధించాయి. మరో రెండు స్థానాల్లో ముందంజలో వున్నాయి. దీంతో ప్రతిపక్షహోదా ఎవరికి దక్కనుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.