ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

ఝరాసంగం ఆగస్టు 10 (జనంసాక్షి ) 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుదవారం ఈదుల పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంలో జెండాలు పంపిణి చేసిన సర్పంచ్ బస్వరాజు పాటిల్, తెరాస మండల అధ్యక్షులు రాచయ్య స్వామి లు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సంబరాలు అందరు సంతోషంగా పండుగ వాతావరణం లో జరుపుకోవాలని సూచించారు. ప్రతి ఇంటి పైన జాతీయ జెండాలు ఎగురవేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశోక్ ఉప సర్పంచ్ యేసయ్య, తెరాస గ్రామ అధ్యక్షులు పండరి నాయకులు సంగమేశ్వర్ ఇస్మాయిల్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.