ప్రతి పేద విద్యార్థికి అండగా అంబేద్కర్ చేయూత ఫౌండేషన్

స్వేరో సర్కిల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుప్పలి అశోక్ కుమార్
కుల్కచర్ల,అక్టోబర్ 7(జనం సాక్షి):
అంబేద్కర్ చేయూత పౌండేషన్ (ఏసీఎఫ్)ప్రతి పేద విద్యార్థికి అండగా ఉంటుందని స్వేరో సర్కిల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుప్పలి అశోక్ కుమార్ సూచించారు.శుక్రవారం కుల్కచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామానికి చెందిన వై రాములు కుమారుడు ఎర్రం రవి చరణ్ కు ఢిల్లీ ఐఐటి సీటు రావడంతో వారిని ఏసీఎఫ్(అంబేద్కర్ చేయూత ఫౌండేషన్) మరియు అంబేద్కర్ సంఘాల తరపున కుల్కచర్ల అంబేద్కర్ పెద్ద గేటు చౌరస్తా వద్ద రవి చరణ్ ను అభినందించి, ఘనంగా సన్మానించారు.అనంతరం వారి చదువుల కోసం రూ.10,000 (పదివేల రూపాయలు)ఆర్థిక సాయం అందజేశారు.ఈ సందర్భంగా ఏసీఎఫ్ వ్యవస్థాపకులు స్వేరో సర్కిల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుప్పలి అశోక్ కుమార్ మాట్లాడుతూ..పేద విద్యార్థులకు,అట్టడుగు నిరుపేద వర్గాల చదువుకు నిరంతరం సహకరిస్తామని తెలిపారు.ఏసీఎఫ్ కు ప్రతి ఒక్కరూ సహకరించగలరని కోరారు.ఈ కార్యక్రమంలో ఏసీఎఫ్ సభ్యులు కరుణాకర్, మురళీకృష్ణ,దగ్గుల వెంకటయ్య టీచర్,నాగని.వెంకట్రాములు, అంబేద్కర్ సంఘం సలహాదారులు గుండుమల్ల నర్సింలు,అంతారం వెంకట్ రాములు,చౌడపూర్ రమేష్ కుమార్, ఓయూ విద్యార్థి మోగిలిగిద్ద ప్రసాద్,విష్ణు,దాస్,బన్నీ,సుదర్శన్,దోమ మండలం అంజీలయ్య,డీటీ విజహేందర్,హనుమంతు,కోస్గి మండలం నరేష్ ,వెంకట్రాములు,ప్రసన్న కుమార్,గండీడ్ బాబు, కుల్కచర్ల మండలం మేకుల యాదగిరి,కర్రె రాములు,బాబు,పోతగాళ్ల వెంకటయ్య, భీమయ్య మరియు కుల్కచర్ల అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.