ప్రతి వ్యక్తి దేశభక్తి కలిగి ఉండాలి
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
బచ్చన్నపేట ఆగస్టు 13 జనంసాక్షి
భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి దేశం మీద ప్రేమ మరియు భక్తి కలిగి ఉండాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు శనివారం మండల కేంద్రంలో 75వ భారత దేశ స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా విద్యార్థులు యువకులు, మహిళలు మేధావులతో కలిసి బచ్చన్నపేట ప్రధాన చౌరస్తా నుండి కేసీఆర్ చౌరస్తా వరకు వజ్రోత్సవాల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో పోరాటాల కృషి స్వాతంత్రం వచ్చిందని అందుకుగాను ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర మంతట వజ్రోత్సవాలు జరుపుకుంటున్నామని కన్న కలలను కెసిఆర్ గారి సారధ్యంలో బడుగు బలహీన వర్గాలను కలుపుకొని అహింసా మార్గంలో అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి వజ్రోత్సవాల స్పెషల్ ఆఫీసర్ విజయ్ కుమార్ ఎస్ఐలు నవీన్ కుమార్ సృజన్ కుమార్ వైద్యాధికారి సిద్ధార్థ రెడ్డి వడ్డేపల్లి మల్లారెడ్డి గంగం సతీష్ రెడ్డి గిద్దెల రమేష్ వెంకట్ గౌడ్ మధు ప్రసాద్ కోనేటి స్వామి మాసాపేట రవీందర్ రెడ్డి ఎంపిటిసిల పురం మండల అధ్యక్షులు దూడల కనకయ్య గౌడ్ గంధ మల్ల నరేందర్ మల్యాల అఖిల్ మాల చంద్రశేఖర రావు తదితరులు పాల్గొన్నారు