ప్రతీసీటు గెలుపు ముఖ్యం

అందుకే బరిలో ఉన్నామన్న రాజగోపాల్‌ రెడ్డి

నల్లగొండ,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఎమ్మెల్సీలకు కాంగ్రెస్‌ టిక్కెట్లు ఇవ్వడాన్ని కాంగ్రెస్‌ అబ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి సమర్థించుకున్నారు. గెలుపు అసవరం కనుక కొందరు ఎమ్మెల్సీలకు టిక్కెట్లు తప్పలేదన్నారు. అధికారంలోకి రావాలంటే ఎమ్మెల్యే టిక్కెట్లు ముఖ్యం కానీ ఎమ్మెల్సీలు కాదన్నారు. తమకు ఒక్కోసీటు ముఖ్యమేనని అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు నుంచి రాజగోపాల్‌రెడ్డి ప్రస్తుతం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి కనీసం నలుగురు పోటీలో ఉన్నారు. శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో ఈ దఫా ఆరుగురు శాసనమండలి సభ్యులు బరిలోకి దిగారు. వారిలో తెరాస, భాజపా నుంచి ఒక్కొక్కరు, నలుగురు కాంగ్రెస్‌ అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వారున్నారు. కోడంగల్‌ నుంచి తెరాస తరఫున పట్నం నరేందర్‌రెడ్డి, భాజపా తరఫున మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రరావు మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఈసారి అసెంబ్లీకి పోటీచేస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున ఆర్మూర్‌ నుంచి ఆకుల లలిత , నిజామాబాద్‌ గ్రావిూణ నుంచి -భూపతిరెడ్డి, కామారెడ్డి- షబ్బీర్‌ అలీ మునుగోడు నుంచి రాజగోపాల్‌ రెడ్డి

పోటీ పడుతున్నారు. తో పాటు షబ్బీర్‌ అలీ శాసనమండలిలో విపక్ష నేతగా ఉన్నారు. ఆయన పదవీ కాలం త్వరలో ముగియనుండగా, మిగతా నలుగురు అభ్యర్థులది ఇంకా మూడేళ్లు ఉంది. వీరంతా పట్టుబట్టి మరీ రంగంలో ఉన్నారు. గెలుపు గుర్రాలం కనుకనే తామంతా బరిలో ఉండాల్సి వచ్చిందని రాజగోపాల్‌ రెడ్డి అన్నారు.