ప్రతీ విద్యార్ధి గురువులను, తల్లి దండ్రులను గౌరవించాలి

జహీరాబాద్ జులై     (జనంసాక్షి),  ప్రతీ విద్యార్ధి గురువులను, తల్లి దండ్రులను గౌరవించాలని, చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని సమాజానికి ఆదర్శవంతంగా, మార్గదర్శకంగా జీవించాలని
మండల లీగల్ సర్వీసెస్ కమిటీ, జహీరాబాద్ ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ జడ్జి  మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మెన్.డి.దుర్గాప్రసాద్ అన్నారు. శుక్రవారం  స్థానిక వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో లీగల్ అవేర్నెస్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోటారు వాహనాల చట్టం, బాలకార్మిక నిర్మూలన చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, విద్యార్థుల ప్రాథమిక హక్కులు, ఉచిత న్యాయ సేవా సహాయంపై కూలంకుషంగా వివరించారు వివరించారు. ప్రతీ విద్యార్ధి గురువులను, తల్లి దండ్రులను గౌరవించాలని, చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని సమాజానికి ఆదర్శవంతంగా, మార్గదర్శకంగా జీవించాలని సూచించారు. విద్యార్థులందరూ పరిశుభ్రతను పాటించాలని అన్నారు. అత్యవసర సమయంలో 100 కి గాని 1098 కి ఫోన్ చేసి సహాయం పొందవచ్చని అన్నారు. కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ దత్తాత్రేయ రెడ్డి,  న్యాయవాదులు గోపాల్, మానెన్న, శ్రీనివాస్ కన్నా, బ్రహ్మానంద రెడ్డి, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు  పాల్గొన్నారు.