ప్రధాని మోడీకి పలువురు జన్మదిన శుభాకాంక్షలు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్రమోడీ 68వ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖులు, సెలబ్రిటీలు, సామాన్యుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్‌ సహా పలువురు ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. దేవుడి దీవెనలతో ప్రధాని మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని సీఎం కేసీఆర్‌ అధికారిక ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో పురోగమిస్తుందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. దేశ ప్రజలను సాకారం చేసేందుకు మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఎంపీ కవిత, రాజ్‌నాథ్‌, జైట్లీ, ప్రార్థించారు. మోదీ తన పుట్టినరోజు వేడుకలను సొంత నియోజకవర్గమైన వారణాశిలో జరుపుకోనున్నారు. మధ్యాహ్నం నరూర్‌ గ్రామానికి చేరుకుని అక్కడి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కలిసి మోదీ కేక్‌ కట్‌ చేయనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.