ప్రధాని సాక్షిగా.. మహిళా మంత్రికి చేదు అనుభవం
– త్రిపుర సభలో తోటి మంత్రి అసభ్య ప్రవర్తన
– వైరల్గా మారిన వీడియో
– మంత్రి తీరుపై మండిపడుతున్న విపక్షాలు
అగర్తాల, ఫిబ్రవరి12(జనంసాక్షి) : మహిళ మంత్రి పట్ల సహచర మంత్రి అసభ్యంగా ప్రవర్తించడం కలకలంరేపింది. త్రిపురలో ఈ ఘటన జరిగింది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి పాల్గొన్న సభలోనే ఘటన జరగడం.. ఆ వీడియో సోషల్ విూడియాలో వైరల్ కావడం తీవ్ర దుమారాన్ని రేపింది. బాధ్యాతాయుతమైన పదవిలో ఉండే ఇదేం బుద్ది అంటూ ప్రతిపక్షాలతో పాటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అగర్తాలలో నిర్వహించిన ఓ ర్యాలీకి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు.. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ కూడా హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి ఆహార మంత్రిత్వ శాఖ మినిస్టర్ మనోజ్ కంతి దేబ్తో పాటు.. త్రిపుర ఏకైకా మహిళా మంత్రి కూడా వెళ్లారు. వేదిక విూద కార్యక్రమం జరుగుతుండగా మనోజ్.. సదరు మహిళా మంత్రిని వెనక వైపు నుంచి అసభ్యకర రీతిలో తాకాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ విూడియాలో చక్కర్లు కొడుతుంది. మహిళా మంత్రి పట్ల మనోజ్ తీరును ఎండగడుతున్నాయి ప్రతిపక్షాలు. ప్రధాని, ముఖ్యమంత్రి సమక్షంలో మనోజ్ ఓ మహిళా మంత్రి పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమె గౌరవానికి భంగం కలిగించాడని, తక్షణమే అతన్ని పదవి నుంచి తొలగించి.. అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయం గురించి మనోజ్ను వివరణ కోరగా అతడు స్పందించడానికి నిరాకరించాడు. ఈ వీడియో రెండు రోజుల తర్వాత సోషల్ విూడియాలో వైరల్గా మారి.. వివాదం రేగింది. అయితే ప్రభుత్వానికి మచ్చ తెచ్చేందుకు ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని బీజేపీ మండిపడింది. ఆ వీడియో బూటకమని కొట్టిపారేశారు. అలాగే సదరు మహిళా మంత్రి నుంచి ఎటువంటి ఫిర్యాదు రాలేదని గుర్తు చేస్తున్నారు.