ప్రభాకర్ రెడ్డి గెలుపుతో మునుగోడు అభివృద్ధి

*మేడి చంద్ర స్వామి
మునుగోడు అక్టోబర్21(జనం సాక్షి):మునుగోడు ఉప ఎన్నికల్లో మిత్రపక్షాల అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడు అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని మాదిగ జేఏసీ మునుగోడు నియోజకవర్గం ఇన్చార్జి మేడి చంద్రస్వామి అన్నారు.శుక్రవారం మండలంలోని ఊకొండి గ్రామంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం గడపగడపకు తిరుగుతూ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈకార్యక్రమంలో అనిల్,శంకర్ దిలీప్,లింగస్వామి,రాములు తదితరులు ఉన్నారు.
Attachments area