ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలను పట్టించుకోదా.? మోహన్ బీఎస్పీ పార్టీ ఆందోల్ అసెంబ్లీ ఇంచార్జ్
రాయికోడ్ జనం సాక్షి జూలై 27 రాయికోడ్ మండల తహశీల్దార్ ముందు గత రెండు రోజుల నుండి కొనసాగుతున్న వీఆర్ఏల నిరవరిక దీక్ష కు మూడవ రోజు మద్దతుగా బహుజన సమాజ్ పార్టీ ఆందోల్ అసెంబ్లీ ఇంచార్జ్ పీపడ్ పల్లి మోహన్ బుధవారం నాడు మండల విఆర్ఏ సంఘీభావం పలికారు.. అనంతరం మోహన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల జీవితాలతో చెలగాటం ఆడటం సరైనది కాదని తెలియజేస్తూ వీఆర్ఏలకు 2017 సంవత్సరంలో ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమై నిద్ర పోతున్నట్లు గా వ్యవహరించడం సరైనది కాదని అదేవిధంగా 2020 సంవత్సరంలో వీఆర్ఏలకు తగిన న్యాయం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాటలతో వరాలు కురిపించినట్లు హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడం చాలా బాధకరమన్నారు. నిండు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన వీఆర్ఏల పే స్కేల్ జీవోను, అర్హత కలిగిన వారిని ఉద్యోగాలకు తీసుకోవాలని, అలాగే పదోన్నతులు కల్పించాలని, 55 సంవత్సరాలు దాటిన వారి యొక్క వారసులకు వీఆర్ఏలుగా ఉద్యోగ అవకాశం కల్పించాలని, వీఆర్ఏల నిరవదిక దీక్ష కు మద్దతుగా ఉంది వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని బహుజన సమాజ్ పార్టీ ఆందోల్ అసెంబ్లీ ఇంచార్జ్ పీపడ్ పల్లి మోహన్ తెలియజేశారు. ఈ నిరవదిక దీక్ష లో వీఆర్ఏల జేఏసి రాయికోడ్ మండల అధ్యక్షుడు జీపీ రత్నం ఉపాధ్యక్షుడు శివకుమార్, మండల వీఆర్ఏలు పాల్గొన్నారు.

Attachments area