ప్రభుత్వానికి స్టీల్‌ ఫ్యాక్టరీ నిర్మించే సత్తా ఉంది: ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌28(జ‌నం సాక్షి): కేంద్రం వెనకడుగు వేసినా రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్‌ ప్లాంట్‌ నిర్మిస్తుందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య స్పష్టం చేశారు. బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకుఅన్ని వనరులున్నప్పటికీ కేంద్రం వెనకడుగు వేయడం తగదన్నారు. సెయిల్‌ ముందుకు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తుందని ఆయన తెలిపారు. అయితే కేందరం ఇచ్చిన హావిూలను నిలబెట్టుకోవాలన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల వెనకబడ్డ ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తీరగలదని అన్నారు.