ప్రభుత్వ పథకాలపై కళాకారుల ప్రదర్శనలు

గద్వాల ప్రతినిధి డిసెంబర్ 14 (జనంసాక్షి):- జోగుళాంబ గద్వాల్ జిల్లా లోని ఇటిక్యాల మండలము కారుపాకుల గ్రామంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గారి ఆదేశాల మేరకు జిల్లా డిపిఆర్ఓ చెన్నమ్మ  ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు..ఈ కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు, కళ్యాణ లక్ష్మి, ఆసరా మరియు మిగతా సంక్షేమ పథకాలపై ఆట పాట ల ద్వారా అవగాహన కల్పించారు..ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా కళాకారులు రేలారే ప్రసాద్, కేశవులు, కృష్ణ, నర్సింహ, స్వామి, రమాదేవి, కవిత, శైలజ, రాహుల్, భూపతి, హజరత్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.