ప్రభుత్వ రాయితీలు నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకి చిదంబరం

న్యూఢిల్లీ: ప్రభుత్వం అందించే రాయితీలను నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకే నగదు రూపంలో బదిలీ చేస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి పి. చిదంబరం అన్నారు. జనవరి 1నుంచి 15 రాష్ట్రాల్లో పింఛను, రాయితీల సొమ్ము ఈ విధంగా జమచేస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఆధార్‌ అనుసంధానంతో రాయితీల నగదు బదిలీలు 2013 చివరి నాటికి పూర్తి చేస్తామన్నారు.