ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివాజీ ని పరామర్శించిన : ఎమ్మెల్యే బీరం.

కోడేరు (జనం సాక్షి) జూలై 22 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని తుర్కదిన్నె గ్రామానికి చెందిన శివాజీ రెండు రోజుల క్రితం పసుపుల గ్రామంలో సెంట్రింగ్ పని చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి గాయాలపాలై హైదరాబాద్ కాచిగూడలోని టి ఎక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి స్వయంగా టె ఎక్స్ ఆసుపత్రికి వెళ్లి శివాజీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో పాటు తెరాస నాయకులు తదితరులు ఉన్నారు.