*ప్రమాదవశాత్తు భవనం పై నుండి పడిపోయిన వ్యక్తికి ఆర్థికంగా చేయూత నిచ్చిన టిఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా యువ నేత*.
జిన్నారం జులై 22 (జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో పడమటి మధుసూదన్ రెడ్డి ప్రమాదవశాత్తు భవనం పై నుండి పడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ జిల్లా యువ నేత, గుమ్మడిదల గ్రామం మాజీ ఉప సర్పంచ్, టిఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు మూడు చింతల నరేందర్ రెడ్డి గారు వారి కుటుంబానికి 10,000 ఆర్థిక సాయం అందజేశారు. ఆయనతోపాటు గ్రామపంచాయతీ సభ్యులు, గ్రామస్తులు, వివిధ యూత్ సంఘాల సభ్యులు తదిరులు పాల్గొన్నారు.
