ప్రమాదాలు నివారించేందుకు చౌరస్తాల వద్ద భారీ గేట్లు ఏర్పాటు.
పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 15(జనంసాక్షి) వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శివాజీ చౌక్ చౌరస్తాను పూర్తిగా మూసివేయడం జరిగినదని పట్టణ సీఐ రాజేందర్ వెల్లడించారు.
గురువారం తాండూర్ పట్టణం ప్రధాన కూడలిలో ప్రమాదలను అరికట్టేందుకు బారి
కేట్లను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పట్టణ సే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల తాండూర్ పట్టణంలో ప్రధాన రహదారులు
రోడ్లు బాగు చేసిన సందర్భంగా భార్యకేట్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
వాహనదారులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని విజ్ఞప్తి చేశారు. చించోళ్ళీ వైపు నుంచి ఇందిరా చౌక్ వైపు, ఇందిరా చౌక్ నుంచి శివాజీ చౌక్ వైపు వాహనాల యొక్క వేగం పెరిగి శివాజీ చౌక్ చౌరస్తా లో రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నందున, విద్యార్థులు స్కూల్ కి తీసుకెళ్లే సమయంలో కూడా రోడ్డు నియమాలు పాటించకుండా ఇష్టం వచ్చిన రీతిలో వాహనాలు నడుపుతున్నారని వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహిస్తున్నామని తెలిపారు. అందరి శ్రేయస్సు దృష్ట్యా మోసివేయడం జరిగిందని తెలిపారు. ముందుకు వెళ్లి యూటర్న్ చేసుకొని వెళ్ళగలర ని విజ్ఞప్తి చేశారు.
Attachments area