ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందజేత

శివ్వంపేట జూలై 26 జనంసాక్షి : మండల పరిధిలోని దొంతి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్తలు చాకలి దాసు, పాలాట సురేశ్ లు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. పార్టీ శ్రేణుల ద్వారా ఈ విషయం జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యుడు, స్థానిక జెడ్పిటిసి పబ్బా మహేష్ గుప్తా మంగళవారం వారి గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించి, ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున మొత్తం పదివేల రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందే విధంగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పిట్ల సత్యనారాయణ, ఉప సర్పంచ్ కొదాసు సత్యనారాయణ, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు మమ్మద్ షఫీవుద్దీన్, నాయకులు శ్రీకాంత్ రెడ్డి, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.