ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జర్నలిస్టుల రక్త నమూనాలు సేకరణ.
దౌల్తాబాద్, ఆగస్టు 8,జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల కేంద్రంలోని పీ హెచ్ సీ , ఇందుప్రియాల్ పీ హెచ్ సీ ల్లో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల రక్త నమూనాలను సోమవారం సేకరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు రక్త నమూనాలను సేకరించామని ఈ రక్త నమూనాల ద్వారా 57 రకాల పరీక్షలు జరిపి జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం వైద్య సదుపాయాలు కల్పించనుందని తెలిపారు. నిత్యం వార్త సేకరణలో విధి నిర్వహణ చేస్తున్న జర్నలిస్టులంతా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇంద్ర మోహన్, సుభాషిణి, సూపర్వైజర్ శ్రీనివాస్, ,ల్యాబ్ టెక్నీషియన్లు శ్యామ్,ఎల్లయ్య, విజయ,శ్రీలత,అనిత,యాదమ్మ, సిబ్బంది తదితరులున్నారు.
