ప్రాథమిక ఉప కేంద్రానికి కుర్చీలు. టేబుల్ అందించిన కల్వకుర్తి పుర చైర్మన్ ఎడ్మసత్యం

నాగర్ కర్నూల్ బ్యూరో జులై26జనంసాక్షి : కల్వకుర్తి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలోని ప్రాథమిక ఉప కేంద్రానికి కుర్చీలు టేబుల్. లేవని పదవ వార్డ్ కౌన్సిలర్ షాహినా బేగం దృష్టికి తీసుకెళ్లిన ఏఎన్ఎం వజ్రపాణి ప్రేమలత. ఇట్టి విషయాన్ని కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ప్రాథమిక ఉప కేంద్రానికి కుర్చీలు. టేబుల్. ఈరోజు ప్రాథమిక ఉప కేంద్రానికి పదవ వార్డ్ కౌన్సిలర్ షాహినా బేగం తాహెర్ అలీ. 21వ వార్డ్ కౌన్సిలర్ సైదులు గౌడ్ వెళ్లి ఇచ్చారు.ANM వజ్రపాణి ప్రేమలత మాట్లాడుతూ ప్రాథమిక ఉప కేంద్రానికి కుర్చీలు. టేబుల్  లేక చాలా ఇబ్బందికరంగా ఉండేదని పదవ వార్డ్ కౌన్సిలర్ షాహినా బేగం తహర్ అలీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే కల్వకుర్తి చైర్మన్ సత్యం గారు కుర్చీలను బెంచ్ అందించడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం గారికి 10 వ వార్డు కౌన్సిలర్ షాహినా బేగం తాహిర్ అలీ గారికి 21 వార్డ్ కౌన్సిలర్ సైదులు గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ANM వజ్రపాణి ప్రేమలత. ఆశ వర్కర్లు రామేశ్వరమ్మ. జ్యోతి. సఫియా బేగం తదితరులు పాల్గొన్నారు
Attachments area