ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఫోటో రైటప్: చిన్నారులతో ఉపాద్యాయులు.
బెల్లంపల్లి, ఆగస్టు15, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ప్రభాత భేరి నిర్వహించి దేశ భక్తి నినాదాలు చేశారు. స్వాతంత్ర్య ఉద్యమ గేయాలను ఆలపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తొలిమెట్టు కార్యక్రమాన్ని ఈ పాఠశాలలో లాంఛనంగా ప్రారంభించారు. చిన్నారుల సైనిక వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేష్, ఉమారాణి, వనజ తదితరులు పాల్గొన్నారు