ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటి డిఎం హెచ్ వో శ్రీనివాస్.

దౌల్తాబాద్ జూలై 22, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల కేంద్రమైన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఖర్చు చేసి ఆస్పత్రి అభివృద్ధికి తోడ్పడే విధంగా ఎలాంటి అవసరాలు ఉన్నాయని గుర్తించేందుకు జిల్లా డిప్యూటీ డి ఎం ఎం హెచ్ ఓ శ్రీనివాస్ తో పాటు వివిధ శాఖల అధికారులు ఆసుపత్రిని సందర్శించి వివరాల్లో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి ఎలాంటి మౌలిక సదుపాయాలు అవసరం ఉన్నాయో వాటిని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు తెలిపారు. ఆయన వెంట వివిధ శాఖల అధికారులు వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
Attachments area