ప్రేమికులకు ముందస్తు హెచ్చరికలు

శృతిమించితే చర్యలు తప్పవన్న పోలీసులు

చెన్నై,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి):ప్రేమికుల దినోత్సవంలో శృతి మించితే ఊరుకునేది లేదని తమఇలనాడు పోలీసులు అప్పుడే హెచ్చరికలు చేశారు. విచ్చలవిడి వ్యవహారాలపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కోసం యూత్‌ ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కారణంతో శ్రుతి మించి ప్రవర్తిస్తే కఠినచర్యలు తప్పవని తమిళనాడు పోలీసులు హెచ్చరిస్తున్నారు. పార్కుల్లో విచ్చలవిడిగా తిరగ డం, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. తాజాగా మదురైలోని ఓ పార్కులో కొంతమంది ప్రేమికులు ఉల్లాసంగా గడుపుతుండగా స్థానిక పోలీసులు వారిని పట్టుకున్నారు. తల్లి దండ్రులకు సమాచారమిచ్చి, వారి సమక్షం లోనే మందలించి ఆ తరువాత విడిచి పెట్టారు. మదురైలోని తిరుప్పరకుండ్రం పార్కు, రాజాజీ చిన్నపిల్లల పార్కు, అన్నా సెంటినరీ పార్కు, అళగర్‌కోయిల్‌ పరిసరాలు, తిరుమలై నాయకర్‌ మహాల్‌ తదితర ప్రాంతాల్లో అలికిడి లేని చోట ప్రేమ జంటలు శ్రుతిమించి ప్రవర్తిస్తున్నారని కొద్దికాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో పోలీసులు పార్కుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, 10కిపైగా జంటలు పట్టుబడినట్లు తెలుస్తోంది. ప్రేమ పేరుతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి, వారిని విడిచి పెట్టారు. ప్రేమికుల దినోత్సవం సవిూపిస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉండడంతో పోలీసుశాఖ అప్రమత్తమవుతోంది. శ్రుతిమించి వ్యవహరించిన ప్రేమికులపై చర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేసింది.