ప్లాస్టిక్ అమ్మితే జరిమానా

మోత్కూరు జూలై    జనంసాక్షి : మున్సిపల్ కేంద్రం పరిధిలో ప్లాస్టిక్ వస్తువులను హోల్ సెల్ గా విక్రయిస్తున్న వాహనాన్ని శుక్రవారం అదుపులోకి తీసుకొని మున్సిపల్ కమీషనర్ సి.శ్రీకాంత్ రూ. 5 వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువులు విక్రయించినట్లయితే భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area