ప్లాస్టిక్ భూతంపై పంజా

ప్లాస్టిక్ వస్తువులు అమ్మే షాపులను సీజ్ చేసిన మునిసిపల్ సిబ్బంది

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం పరిధిలో  ప్లాస్టిక్ అమ్మే షాపులలో మునిసిపల్ కమిషనర్  గోల్కొండ నర్సయ్య, ఆదేశానుసారం మునిసిపల్ ఇంచార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్  వీరేందర్, దాడులు నిర్వహించి షాపులను సీజ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ పై నిషేధం విధించిందని, అందుకే మన అయిజ మునిసిపాలిటీ లో ప్లాస్టిక్ పై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని తెలిపారు.
అందులో భాగంగానే నేడు ప్లాస్టిక్ షాపులను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.కార్యక్రమంలో మునిసిపల్ ఇన్విరాన్మెంటల్ ఇంజనీర్ సురేష్ మునిసిపల్ జవాన్లు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Attachments area