ఫోటోగ్రాఫర్ స్టేట్ ప్రెసిడెంట్ ని కలిసిన గద్వాల్ జిల్లా అసోసియేషన్

మల్దకల్ అక్టోబర్ 11(జనంసాక్షి) హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో జోగులాంబ గద్వాల జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ కమిటీ జిల్లా అధ్యక్షులు ఎస్ఎస్ శేఖర్, ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు హుసేన్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్వహించే ఎక్స్పో కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ సానుకూలంగా స్పందించి త్వరలో తేదీని ప్రకటించి ఆ కార్యక్రమానికి హాజరవుతానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి వేణు,జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణంరాజు, కార్యవర్గ సభ్యులు నరసింహ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Attachments area