ఫ్రీడం రన్ విజయవంతం చేయాలి.

, ఝరాసంగం ఆగస్టు 10 (జనం సాక్షి) : భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడం రన్ నిర్వహించనున్నట్లు మేదపల్లి సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ తెలిపారు.బుదవారం జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 11 (గురువారం) ఉదయం 6:30 గంటలకు ఝరా సంగం లోని ఎంపీడీఓ కార్యాలయం నుండి శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయం వరకు రన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశ సమైక్యతను చాటేలా అధిక సంఖ్యలో యువతీ యువకులు, విద్యార్థులు, క్రీడాకారులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, ఉత్సాహవంతులు పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.