ఫ్రీడమ్ కప్ మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్
• టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మామిడి మోహన్ రెడ్డి
దౌల్తాబాద్, ఆగస్టు 19, జనం సాక్షి.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పిస్తామని ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మామిడి అన్నారు స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం దౌల్తాబాద మండల కేంద్రంలో మండల స్థాయి ఫ్రీడం క్రీడోత్సవాలను నిర్వహించారు ఇందులో గెలుపొందిన పథమ బహుమతి 5000 ద్వితీయ బహుమతి 3000 మెమెంటోళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని వారిని వెలికి తీయడానికిచేయడానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు సముచిత స్థానం కల్పించడానికి ప్రభుత్వం గ్రామ గ్రామాన క్రీడా మైదానాలను ఏర్పాటు చేసిందని, క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాల అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్నారు దుబ్బాక నియోజకవర్గం లోని అన్ని మండల కేంద్రాల్లో మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించి యువతలో దాగివున్న క్రీడా ప్రతిభను వెలికి తీసి వారిని రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించే విధంగా తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈ క్రీడా పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషం కలిగిస్తుంది అన్నారు.ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, రాయపోల్ జెడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి, దౌల్తాబాద్ మాజీ సర్పంచ్ వేణు, ఉప సర్పంచ్ యాదగిరి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు జాఫర్ ,బాసం నరసింహారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి ,మంజూర్, నర్సింగరావు శ్రీనివాస్ చారి, నర్ర రాజేందర్ ,ఇప్ప వెంకట్, తుడుం ప్రశాంత్, తుప్పతి కుమార్, తుప్పతి ప్రవీణ్, ఆర్గనైజర్స్ స్వామి, మహేష్,
వివిధ గ్రామాల క్రీడాకారులు పాల్గొన్నారు.
