బంగ్లాదేశ్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

 హైదరాబాద్‌: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో గత రాత్రి ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఆ ఇద్దరు ఉగ్రవాదులు నిషేధిత జమాతుల్‌ ముజాహిదీన్‌ బంగ్లాదేశ్‌ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా అధికారులు గుర్తించారు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు వారు ఉన్న భవనాన్ని చుట్టుముట్టామని.. అప్పుడు వాళ్లు.. తమపై బాంబులు విసిరారని అధికారులు చెప్పారు. వారి వద్ద నుంచి నాలుగు అధునాతన గ్రనేడ్స్‌, భారీ పేలుడు పదార్థాలతో కూడిన బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.