*బతుకమ్మ విజేతలకు బహుమతులు అందజేసిన మున్సిపల్ చైర్మన్ కరుణ శ్రీ*

పెబ్బేరు అక్టోబర్ 10 (జనంసాక్షి):
 బతుకమ్మ సంబరాలలో భాగంగా మున్సిపల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ అలంకరణ పోటీలో  బతుకమ్మలను అందంగా అలంకరించిన మహిళలకు సోమవారం మున్సిపల్ చైర్మన్ కరుణ శ్రీ సాయినాథ్ బహుమతుల  ను అందజేశారు. సందర్భంగా   మున్సిపల్ చైర్మన్ కరుణశ్రీ సాయినాథ్ మాట్లాడుతూ మహిళలు అన్ని పోటీలలో పాల్గొని  కళా నైపుణ్యాలను ప్రదర్శించాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్  వైస్ ఛైర్మన్ కర్రేస్వామి, మున్సిపల్ కౌన్సిలర్లు పార్వతి మహేందర్ గౌడ్, అశ్విని సత్యనారాయణ, మేకల సుమతి ఎల్లయ్య యాదవ్, పద్మవేణు యాదవ్, చిన్న ఎల్లారెడ్డి , గోపిబాబు, మరియు మున్సిపల్ అధికారులు, మెప్మా సిబ్బంది, పట్టణ మహిళలు తదితరులు పాల్గొన్నారు.