బదిలీపై వెళుతున్న సబార్డినేటర్ వీడ్కోలు

మల్దకల్ జులై18 (జనంసాక్షి) మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సబార్డినేటర్ మద్దిలేటి జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ కు బదిలీపై వెళుతున్న సందర్భంగా సోమవారం కార్యాలయంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా తహసిల్దార్ సరిత రాణి, నాయబ్ తహసిల్దార్,మదన్ మోహన్ గౌడు తో పాటు కార్యాల సిబ్బంది శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ కిరణ్ ,జూనియర్ అసిస్టెంట్ మధు,కార్యాలయ సిబ్బంది సాయి ,సుబ్రహ్మణ్యం గౌడ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.