బలగలో ఘనంగా భద్రకాళి మ¬త్సవాలు

శ్రీకాకుళం,మార్చి19(జ‌నంసాక్షి): తొమ్మిదేళ్లకోసారి నగరంలోని బలగలో నిర్వహించే భద్ర మహాంకాళీ పెద్ద పండుగలు అత్యంత వైభవంగా మొదలయ్యాయి,. 14 అడుగుల భద్ర మహాంకాళీ అమ్మవారిని వేలాది మంది మహిళలు ఘటాలతో మొర్రాటలు, కుంకుమ పూజలు నిర్వహించి చల్లదన మ¬త్సవం నిర్వహించారు. కిలోవిూటరు దూరంలో మహిళలు ఘటాలతో బారులు తీరి, అమ్మవారికి మొర్రాటలు సమర్పించారు. జానపద కళారూపాలు, డప్పుల విన్యాసాలు, మేళతాళాలతో అమ్మవారి ఊరేగింపు మ¬త్సవం సాగింది. బలగ పరిసర ప్రాంతాలు భక్తులతో కళకళలాడుతున్నాయి.