బహుజనులకు రాజ్యాధికారం కోసం నిరంతరం పోరాటం చేస్తా
భీంగల్ ప్రతినిధి(జనంసాక్షి):బహుజనుల రాజ్యాధికారం కోసం నిరంతరం పోరాటం చేయడానికి కృషి చేస్తానని బహుజన సమాజ్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి చెప్పాల గణేష్ అన్నారు. ఇటీవల టీఆరెస్ పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీ పార్టీలోకి చేరారు.బీఎస్పీ పార్టీ బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జి గా బాధ్యతలు చెప్పాల గణేష్ తీసుకున్నారు. భీంగల్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో బుద్దిచెపుతామని అన్నారు.తెలంగాణలో ఎస్సి,ఎస్టీ,బిసి, మైనార్టీల ప్రజలు బీఎస్పీ పార్టీ కే మద్దతు తెలుపుతున్నారని అన్నారు.తనపై నమ్మకంతో నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పిన బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆరేస్ ప్రవీణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గైని గంగారాం,బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.
