బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం..
ఊరుకొండ, ఆగస్టు 28 (జనం సాక్షి):
ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రాజేష్(30) ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా మృతి చెందాడు.
రాణిపేట గ్రామానికి చెందిన సూర్య కిరణ్ (20) సైతం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విశాద సంఘటనను మండల కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలుసుకున్న మాదారం సర్పంచ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ధ్యాప నిఖిల్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తక్షణ ఆర్థిక సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.5000/- చొప్పున మండల కాంగ్రెస్ నాయకుల ద్వారా అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదల్ మండల అధ్యక్షుడు గణేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంఠం విజయుడు, బోయ రవి, రాజు, ఆదినారాయణ, దయాకర్, రాజు, గోపాల్, దేవయ్య, కుమ్మరి రాములు, పరశరాములు, తదితరులు ఉన్నారు.