బిజెపి, మోడీది పిరికిపంద చర్య

మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు నిరసిస్తూ ధర్నా
మేడిపల్లి – జనంసాక్షి
కేంద్రం ప్రభుత్వం, బీజేపీ పార్టీ నాయకులు అవలంబిస్తున్న కుటిల రాజకీయాలను తిప్పికొట్టాలని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సాగుతున్న అరాచక పాలనను పాతరేయాలని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. బిజెపి పార్టీది, ప్రధాని మోడీది పిరికిపంద చర్య అని అభివర్ణించారు. రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంటిపై జరుగుతున్న ఐటి దాడులకు నిరసనగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు హరి శంకర్ రెడ్డి, మద్ది యుగంధర్ రెడ్డి, వై అనంతరెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు,నాయకులు తూముకుంట శ్రీధర్ రెడ్డి, బండారి రవి, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు