బివిజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత బిపి. షుగర్ టెస్టులు.

వికారాబాద్ జిల్లా యాలాల మండలం దేవనూరు గ్రామంలో బుధవారం బి వి జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత బిపి మరియు షుగర్ టెస్టులు నిర్వహించారు. ఉచిత  టెస్టుల కోసం గ్రామ ప్రజలు, యువకులు వెళ్లి టెస్టులు చేయించుకున్నారు.
ఈ సందర్భంగా బి వి జి  ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ ను జనం సాక్షి వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ
ప్రజల శ్రేయస్సు కోసం మండలంలోని ప్రతి గ్రామంలో ఒక్కొక్క రోజు  ఉచిత బిపి షుగర్ టెస్ట్ లు చేయించడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజల శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని పేర్కొన్నారు.. ఇక ముందు కూడా మరెన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత సేవలందిస్తామని బి వి జి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని ఆయా గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.