బీఆర్‌ఎస్‌,బీజేపీ విలీనం అంతా ట్రాష్‌

` భారాస ఔట్‌డేటెడ్‌ పార్టీ
` కేటీఆర్‌ జైలు కెళ్లడం ఖాయం
` ఆ పని రేవంత్‌ చూసుకుంటారు
` కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):మాజీ మంత్రి కేటీఆర్‌ కు జైలు తప్పదని, ఆయన చేసిన అరాచకాలు, అవినీతి అందరికీ తెలుసునని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్‌ విలీనం వార్తలను ఆయన కొట్టి పారేశారు. బిఆర్‌ఎస్‌ పని అయిపోయిందని అన్నారు. శనివారం ఆయన విూడియాతో చిట్‌ చాట్‌ చేశారు. కేటీఆర్‌ ను జైలుకు పంపే పనిని సీఎం రేవంత్‌ రెడ్డి చూసుకుంటారని చెప్పారు. తనతోపాటు ఎందరో బీజేపీ కార్యకర్తలను నాయకులను కేటీఆర్‌ జైల్లో వేసి హింసించారని దానిని తానింకా మర్చిపోలేదని అన్నారు. బీఆర్‌ఎస్‌ బీజేపీతో చర్చలు జరిపినట్టు వస్తున్నవి ఫేక్‌ న్యూస్‌ అని అన్నారు. బీఆర్‌ఎస్‌ ఓ ఔట్‌ డేటెడ్‌ పార్టీఅని అన్నారు. కవిత బెయిల్‌ కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. సిసోడియాకు బెయిల్‌ వస్తే బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా..? అంటూ ప్రశ్నించారు. కోర్టు అంశాలను పార్టీతో ముడిపెట్టడం సరికాదని చెప్పారు. రాష్ట్రంలో నిజాయితీగా పనిచేసే ఐపీఎస్‌ లకు ఇప్పటికీ పోస్టింగ్‌ ఇవ్వకపోవడం విడ్డూరమన్నారు. బిఆర్‌ఎస్‌ కొమ్ముకాసిన ఐఏఎస్‌ లకే మళ్లీ పోస్టింగులు ఇస్తునారని చెప్పారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పాలనకు మధ్య పెద్దగా తేడా ఏవిూలేదని, అతి తక్కువ టైంలో ప్రజా వ్యతిరేకత చురగొన్న ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని బండి సంజయ్‌ అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ, జడ్పీటీసీలే మా బ్రాండ్‌ అంబాసిడర్లని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన సోదరుడి కోసమే అమెరికా వెళ్లారనటం సరికాదని బండి అన్నారు. రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఇతర పార్టీలను చీల్చి లాభం పొందాలనే ఆలోచన బీజేపీకి లేదన్నారు. కాంగ్రెస్‌ కు ప్రజలు ఐదేళ్ల తీర్పు ఇచ్చారని, అధికారాన్ని ఉంచుకుంటారా? వదులుకుంటారా? అనేది వాళ్ల పై ఆధారపడి ఉంటుందని అన్నారు. అసదుద్దీన్‌ ఓ వైసీ ఎన్ని వక్ఫ్‌ బోర్డు భూములను కాపాడారో చెప్పాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. గతంలో వక్ఫ్‌ బోర్డు భూములను కాంగ్రెస్‌, ఎంఐఎం నేతలు చా లా చోట్ల కబ్జా చేశారని విమర్శించారు. సవరణ బిల్లు ఆమోదం పొందితే అన్ని విషయాలు బయటికి వస్తాయని విరించారు. వక్ఫ్‌ బోర్డు భూములకు సంబంధించి ఎంత మంది పేద ముస్లింలకు ఇచ్చారో చెప్పగలరా అని ప్రశ్నించారు. వక్ఫ్‌ బోర్డు భూములను కాంగ్రెస్‌, ఎంఐఎం నేతలు చాలా చోట్ల కబ్జా చేశారని.. వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందితే… వాస్తవాలన్నీ బయటకు వస్తాయన్నారు. బీజేపీ స్టేట్‌ చీఫ్‌ ఎవరనేది జాతీయ అధ్యక్షుడు నడ్డా డిసైడ్‌ చేస్తారని అన్నారు. అధినాయకత్వం నిర్ణయమే పార్టీకి శిరోధార్యమని చెప్పారు.కాంగ్రెస్‌లో లుకలుకలు మొదలయ్యాయని.. ఇతర పార్టీలను చీల్చి లాభం పొందాలనే ఆలోచన బీజేపీకి లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ కు ప్రజలు ఐదేళ్ల తీర్పు ఇచ్చారు.. ఐదేళ్లు అధికారాన్ని ఉంచుకుంటారా? వదులుకుంటారా? అనేది ప్రభుత్వ తీరుపై ఆధారపడి ఉందన్నారు. హైకమాండ్‌ ఎవర్నిబీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమిస్తే వారి నేతృత్వంలో పని చేస్తామన్నారు.