బీచుపల్లి పుణ్యక్షేత్రంలో ఘనంగా సీతారాముల కళ్యాణం

ఇటిక్యాల (జనంసాక్షి) జూలై 17 :
మండల పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సోమవారం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అమావాస్య, పునర్వసు నక్షత్రం సందర్భంగా వేద పండితులు శ్రీ దత్తుస్వామి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు మండల కేంద్రంతో పాటు తిమ్మాపురం, కొండపేట, యాక్తాపురం, ఎర్రవల్లి చౌరస్తా, షేక్ పల్లి, జింకలపల్లి, కొండేరు, కోదండాపురం, సాసనూలు, దువాసిపల్లి, ఆర్.గార్లపాడు పెద్దదిన్నె, పుటాన్దొడ్డి, ధర్మవరం కాక పెబ్బేరు,వనపర్తి, గద్వాల ప్రాంతాల నుండి భక్తులు బీచుపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకొని సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణం జరిపించేందుకు ఆలయ పాలక మండలి వారు పట్టు వస్త్రాలను అందజేశారు. అలాగే పాలక మండలి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు సురేందర్ రాజు తెలిపారు.