బీజింగ్‌ చేరుకున్న ఖుర్షీద్‌

బీజింగ్‌ : భారత విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ ఈరోజు మధ్యాహ్నం బీజింగ్‌ చేరుకున్నారు. రెండు రోజుల బీజింగ్‌ పర్యటనలో ఆయన భారత్‌, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారు. త్వరలో చైనా ప్రధాని భారత్‌ సందర్శించనున్న నేపథ్యంలో ఖుర్షీద్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.