బీజేపీ తోనే దేశం అభివృద్ధి

-చింతలగట్టు సుధీర్ కుమార్
జహీరాబాద్ నవంబర్ 19 (జనంసాక్షి) బీజేపీ తోనే దేశం అభివృద్ధి అని  చింతల్ ఘట్ సుధీర్ కుమార్ అన్నారు. గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తన శ్రేయోభిలాషులతో చర్చించిన అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి బిజెపి పార్టీలో చేరుతున్నట్లు చింతలగట్టు సుదీర్ కుమార్ తెలిపారు.శుక్రవారం రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సూచన మేరకు పార్లమెంటరీ వ్యవహారాలు మరియు కేంద్రమంత్రి  ప్రహ్లాద్ జోషి సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు,  తన సొంత నియోజకవర్గమైన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుండి వందలాది సంఖ్యలో హైదరాబాద్ కు  తరలి వెళ్తున్నా సందర్భంగా ఆయన మాట్లాడారు.దేశంలో మోడీ నాయకత్వంలో అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలతో దేశం అభివృద్ధి చెందుతుందని బిజెపి చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితునై మోడీ,అమిత్ షా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ ల నాయకత్వం లో  తాను పనిచేయడానికి బిజెపిలో చేరుతున్నట్టు తెలిపారు.  జహీరాబాద్ లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జనరల్ సెక్రెటరీ ప్రేమేందర్ రెడ్డి జిల్లా ఇంచార్జ్ జై శ్రీ  జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి  జిల్లా జనరల్ సెక్రెటరీ జగనాథం  అసెంబ్లీ కన్వీనర్ జనార్దన్ రెడ్డి జహీరాబాద్ నియోజకవర్గం ముఖ్య  నాయకులు  పాల్గొన్నారు.